Saturday, July 27, 2024
HomePoliticalముదిరాజ్ లకు వరాలు కురిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముదిరాజ్ లకు వరాలు కురిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 15, హైదరాబాద్ :  ముదిరాజ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముదిరాజ్‌లను బీసీ-డీ నుండి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు పోరాడుతామని ప్రకటించారు. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచిలా పోరాడుతామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ పేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర పేరిట బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలనే కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంటే పదేళ్లు పాటు మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని* హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దొరలకు, పెత్తందారులకు మాత్రమే టికెట్ ఇవ్వలేదని.. పేదలకు, బీసీ కులాల వారికి టికెట్లు ఇచ్చి గెలిపించిందని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గకరీణ జరగాల్సిందే.. మాదిగలకు న్యాయం జరగాల్సిందేనని అన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments