Friday, October 18, 2024
HomeHyderabadడివిజన్ నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార తీసుకుంటాం - కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

డివిజన్ నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార తీసుకుంటాం – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

శేరిలింగంపల్లి ( గచ్చిబౌలి ), జూన్ 22: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ లో సాయి ఐశ్వర్య కాలనీ కోర్పొరేటర్ గంగాధర్ రెడ్డి కాలనీ వాసులు కలిసితో పర్యటించారు. కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకునీ సమస్యలపై సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ, మంచినీటి సరఫరా పూర్తయిన ప్రాంతాల్లో సీసీ రోడ్డులు రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని కోరారు.

స్థానికంగా ఉన్న మురుగు నీటి కాలువ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుందని, సరైన చర్యలు తీసుకోకపోవటం, శుభ్రం చెయ్యకపోవటం వల్ల తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నామని కాలనీ వాసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆదేశించారు.

వెంటనే తగు చర్యలు తీసుకోని, మురుగు కాలువ పనులు చేపడాతమని కాలనీ వాసులకు గంగాధర్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్పొరోటర్ గంగాధర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు. అదేవిదంగా పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు.

పెరుగుతున్న జనాభా దృశ్య డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్క కాలనీ నుండి మరొక కాలనీ కి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకోని రావాలని ప్రజలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో జి.హెచ్.ఎం.సి, డీఈ విశాలాక్షి, ఏఈ జగదీష్, సాయి ఐశ్వర్య రెసిడెంట్స్ వెల్ఫేర్ అస్సోసిషన్ కమిటీ సభ్యులు, ప్రభాకర్, అమిత్ భరద్వాజ్, భాగ్య లక్ష్మి, నర్సింహా మూర్తి, అశోక్ రాజు, రమణి రామ చంద్ర రావు, విజయ కుమార్, రమణి, సాయి ఐశ్వర్య కాలనీ వాసులు రామ్ చందర్ రావు చిట్టి బాబు మహేష్, ఈశ్వర్, శ్రీధర్, విజయ్, సతీష్ చంద్ర మురళి, అతుల్, మనీష్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, తిరుపతి సీనియర్ నాయకులు, సుధాకర్ రాజేష్, అరుణ్ కృష్ణ బన్నీ, కిశోరె ఈశ్వరయ్య, సతీష్ నర్సింగ్ నాయక్, స్థానిక నేతలు, సాయి ఐశ్వర్య కాలనీ వాసులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments