Tuesday, September 17, 2024
HomeTelanganaసగరులు రాజకీయంగా ఎదిగేందుకు సహకారం అందిస్తా - డీకే అరుణ

సగరులు రాజకీయంగా ఎదిగేందుకు సహకారం అందిస్తా – డీకే అరుణ

*సగరులు రాజకీయంగా ఎదిగేందుకు సహకారం అందిస్తా – డీకే అరుణ

*విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం లో హాజరైన ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 15 : సగరులు రాజకీయంగా ఎదిగేందుకు తన పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ హామీ ఇచ్చారు. ఏ వర్గాలైన ఉన్నత స్థాయిలో నిలవాలంటే ఉన్నత చదువులే కారణం అవుతాయని అభిప్రాయపడ్డారు. సగర సేవా సమితి, మహబూబ్ నగర్ జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్ నగర్   ఏనుగొండ సగర భవనంలో నిర్వహించిన సగర విద్యార్థుల కు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

సమాజంలో వేలునుకొని ఉన్న రుగ్మతల తొలగింపుకు ఉన్నత చదువులే కారణమవుతాయని ఆమె అన్నారు. భవిష్యత్తు తరాలు ఆశించిన స్థాయిలో మారాలంటే అక్షర జ్ఞానంతోనే మొదలు పెట్టాలని ఆమె సూచించారు. సగరుల అభ్యున్నతి కోసం కుల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె అన్నారు. సగరులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో సగరుల రాజకీయ ఎదుగుదలకు తన పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సగరులు పోటీ చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.

గౌరవ అతిథిగా హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సగరులు ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నారని, ప్రభుత్వపరంగా సగరులకు కావాల్సిన సహకారాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను మరింత ప్రదర్శించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు.

తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రిజర్వేషన్ల పై ఆధారపడకుండా ప్రతిభా పాటవాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సగరుల హక్కుల సాధన కోసం రాష్ట్ర సగర సంఘం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో సగరులు బి సి డి లో నుంచి ఏలోకి మారెందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే రాష్ట్రస్థాయిలో సగర విద్యార్థుల కు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తు ఉన్నతి కోసం సగరులు మరింత ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సగర సేవా సమితి అధ్యక్షులు పర్వతాలు సగర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సగర సంఘం చీఫ్ అడ్వైజర్ ఆర్.బి ఆంజనేయులు సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడ్డన్న సగర, జిల్లా అధ్యక్షులు సాయి ప్రనిల్ చందర్ సగర, మాజీ రాష్ట్ర అధ్యక్షులు బంగారు నరసింహ సగర, రిటైర్డ్ అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ నగర్, సగర సేవా సమితి ప్రధాన కార్యదర్శి నారాయణ సగర, కోశాధికారి గోపాల్ సగర, ప్రేమ్ సాగర్, ఉదయ్ సాగర్, అడ్వకేట్ హనుమంతు సాగర్, మూసాపేట్ మాజీ జెడ్పిటిసి ఇంద్రయ్య సగర, బిజెపి సీనియర్ నాయకులు దేవన్న సగర, సగర యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సవారీ సత్యం సగర, బిసి సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస సాగర్, చుక్కల చంద్ర శేఖర్ సాగర్, చంద్ర మోహన్ సాగర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ సాగర్, సుధాకర్ సగర తదితరులు పాల్గొన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments