Friday, October 18, 2024
HomeHyderabadబడి బాటలో పాల్గొన్న హామీద్ పటేల్

బడి బాటలో పాల్గొన్న హామీద్ పటేల్

శేరిలింగంపల్లి, జూన్ 14:   ప్రతి ఒక్క చిన్నారి బడి బాట పట్టి ఉన్నత స్థానాలకు చేరుకొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీర్చి దిద్దాలి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న, ప్రొఫెసర్ జయ శంకర్ బడి బాట కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. కొండాపూర్ డివిజన్ కొత్తగూడలో ఏంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన “ప్రొఫెసర్ జయ శంకర్ బడి బాట” కార్యక్రమంలో పాల్గొని, పలువురు చిన్నారులకు పలక, బలపాలు, పెన్సిల్లు, పుస్తకాలు పంపిణి చేసి, మంచిగా చదివి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ చిన్నారులను ఆశీర్వదించారు.

ఈ సందర్బంగా పలువురు చిన్నారులకు అక్షరాభాష్యం చేయించి చిన్నారులచే అక్షరాలు దిద్దించి, ఆశీర్వదించారు.  కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ తో పాటు ఏంఈఓ కే. వెంకటయ్య, ఏంయన్ఓ కే. రాములు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఏం ఏం. నాగయ్య, మౌరి టెక్ ఫౌండేషన్ నిర్వాహకులు స్వర్ణ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్ జంగం గౌడ్, నీలం లక్ష్మి నారాయణ ముదిరాజ్, కేశం కుమార్ ముదిరాజ్, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, మొహ్మద్ ఖాసీం, మొగుల స్వామి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments